Friday, April 18, 2008
Wednesday, April 16, 2008
ఆకు పచ్చ సినిమా 1
Posted by Rajendra Devarapalli at 4/16/2008 10:56:00 PM 0 comments
Labels: ఆకు పచ్చ సినిమా
Posts RelacionadosMonday, March 31, 2008
మూడు ఆంధ్రజ్యోతి వార్తలు
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/30national9
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/31business4
సింహాద్రి' కాలుష్యంపై సీరియస్
అసెంబ్లీలో ఎమ్మెల్యే లేవనెత్తడంతో అప్రమత్తం
విశాఖపట్నం, మార్చి 30 (ఆన్లై న్): నేషనల్ థర్మల్ పవర్ ప్లాంట్ (సింహాద్రి) కాలుష్యంపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పిసి బి) అప్రమత్తమైంది. విద్యుత్ తయా రీకి వినియోగించే ముడిసరుకు నుం చి విడుదలైన యాష్ను నిల్వ చేయ డంలో ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించింది. పారిశ్రామి క ప్రాంత పరిశ్రమల కాలుష్యంపై పెందుర్తి ఎమ్మెల్యే తిప్పల గురు మూర్తిరెడ్డి ఈ నెల 25న అసెంబ్లీలో ప్రస్తావించడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
ప్రజలకు ఇబ్బం దులు కలుగజేసే పరిశ్రమలపై కొర డా ఝుళిపించేందుకు వెనుకాడమని అటవీ, కాలుష్య నియంత్రణ శాఖ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు చెప్పడంతో సంబంధిత శాఖ రంగం లోకి దిగింది. పిట్టవానిపాలెం, దేవా డ, పాలవలస, కడితినాయుడు పాలెం, మరడదాసరిపేట తదితర గ్రామాలకు ఎన్టీపీసీ యాష్ గాలి ద్వారా చేరడంతో ప్రజలు ఉక్కిరిబిక్కి రవుతున్నారని కాలుష్య నియంత్రణ మండలి ఇప్పటికే ధ్రువీకరించింది.
దీనిపై ఆంధ్రవిశ్వవిద్యాలయ నిపుణు లు కూడా పరిశోధించి యాష్తో ప్ర మాదం వుందని స్పష్టం చేశారు. దీని తో సింహాద్రి యాజమాన్యానికి కాలు ష్య నియంత్రణ మండలి అధికారులు గతంలో మార్గదర్శకాలు జారీ చేశా రు. అయినా యాజమాన్యం నుంచి స్పందనలేదు. ఈ విషయంలో ఎ మ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించేసరికి కాలుష్య నియంత్రణ మండలి ఉన్న తాధికారులు రంగంలోకి దిగారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని మండలి మెంబర్ కార్యదర్శి రాజేష్ తివారీ సంబంధిత అధికారులను ఆదేశిం చారు.
ఇందుకు సంబంధించి మం డలి టాస్క్ఫోర్స్ అధికారి శివారెడ్డి పూర్తి వివరాలను అందజేసినట్టు తెలి సింది. సింహాద్రి యాజమాన్యాన్ని పిలిచి న్యాయ విచారణ జరిపి నిబం ధనల అమలుకు మార్గదర్శకాలు రూ పొందించాలని నిర్ణయించినట్టు తెలి సింది. దీనిపై మండలి టాస్క్ఫోర్స్ అధికారి శివారెడ్డిని వివరణ కోరగా, సింహాద్రి ప్లాంట్ యాష్ వల్ల కాలు ష్యం ఎక్కువగా వున్నట్టు చెప్పారు. యాష్ పాండ్ గట్టు ఎత్తు పెంచాలని, యాష్పై నిరంతరం నీటిని ్రస్పే చేయాలని, ట్రీట్మెంట్ చేయకుండా కూలింగ్ నీటిని సముద్రంలోకి విడి చిపెట్టరాదని సూచించామన్నారు. అయితే తాము సూచించినవేవీ అమలు కానందున మరోసారి గట్టిగా చెప్పేందుకు నిర్ణయించామన్నారు.
http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/mar/30state7







